బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ (అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం)
ముందుమాట
ఇన్నల్ హమ్ద లిల్లాహి, నహ్మదుహు వ నస్తయీనుహు వ నస్తగ్ఫిరుహు వ నఊజు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అఅ్ మాలినా (సర్వస్తోత్రాలు అల్లాహ్’కు మాత్రమే చెందుతాయి, మేము ఆయనను స్తుతిస్తున్నాము, ఆయన తో సహాయం ఆర్ధిస్తున్నాము, క్షమాపణ వేడుకుంటున్నాము మరియు మా ఆత్మల కీడు నుండి, దుష్కర్మల నుండి ఆయన శరణు వేడుచున్నాము). మయ్యహ్దిహిల్లాహు ఫలా ముజిల్ల లహు, వ మయ్యజ్లులు ఫలా హాదియ లహు, (అల్లాహ్ మార్గదర్శనం చేసినవాడిని మార్గభ్రష్టుడిగా మార్చలేరు, మరియు ఆయన మార్గభ్రష్టుడిగా మర్చినవాడికి సన్మార్గ దర్శనం ఎవరు చేయలేరు). అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వరసూలుహూ.( వాస్తవానికి అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని, ఆయన ఒక్కడే ఆయనకు సాటి ఎవరు లేరని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ఆయన దాసుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను). దీని తరువాత
అల్లాహ్ తఆలా ఆదమ్ సంతతికి గౌరవం ప్రసాదించాడు. మరయు తన సృష్టిలోంచి చాలా వాటిపై వారికి ప్రాధాన్యతను ప్రసాదించాడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
{మేము ఆదం సంతతికి గౌరవం వొసగాము} [అల్ ఇస్రా : 70 ]
మరియు ఆయన ఈ సమాజ గౌరవాన్ని పెంచాడు. కావున ఆయన వారి వద్దకు తన ప్రవక్తల్లోంచి ఉత్తమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను పంపాడు. మరియు ఆయన తన గ్రంధముల్లోంచి ఉత్తమ గ్రంధము దివ్య ఖుర్ఆన్ ను వారిపై అవతరింపజేశాడు. మరియు వారి కొరకు తన ధర్మ శాసనముల్లోంచి ఉత్తమ ధర్మం ఇస్లాంను ఇష్టపడ్డాడు.
మహోన్నతుడైన ఆయన ఇలా సెలవిచ్చాడు :
{మీరే (విశ్వాసులే) మానవజాతి (హితం) కొరకు నిలబెట్టబడిన ఉత్తమ సమాజం వారు. మీరు ధర్మాన్ని ఆదేశించే (భోదించే) వారు మరియు అధర్మాన్ని నిషేధించే (నిరోధించే) వారు మరియు మీరు అల్లాహ్ యందు విశ్వాసం కలిగి ఉన్నవారు. మరియు ఒకవేళ గ్రంథప్రజలు విశ్వసిస్తే, వారికే మేలై ఉండేది. వారిలో కొందరు విశ్వాసులు కూడా ఉన్నారు. కాని అత్యధికులు అవిధేయులే (ఫాసిఖూన్)}.
[ఆలే ఇమ్రాన్:110]
ఇస్లాం యొక్క మార్గదర్శకత్వంను మరియు దాని పై నిలకడ చూపటం మరియు తన ఆదేశాలను, శాసనాలను అమలు చేయటంను అనుగ్రహించటం అల్లాహ్ మనిషికి ప్రసాదించిన గొప్ప అనుగ్రహం. ఈ పుస్తకం తన పరిమాణంలో చిన్నది, తన వ్యాసపరంగా పెద్దది. క్రొత్తగా సన్మార్గం పొందినవారు (నవముస్లింలు) దీని వ్యాసములను తెలుసుకోవటం తప్పనిసరి. ఈ పుస్తకంలో ఇస్లాం ధర్మం యొక్క ప్రాధమికాంశాలు క్లుప్తంగా వివరించబడ్డాయి. అతడు వాటిని అర్ధం చేసుకుని వాటికి తగిన విధంగా ఆచరించినప్పుడు విధ్యను నేర్చుకోవటానికి మరియు దానితో తన ప్రభువు, తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, తన ధర్మం ఇస్లాం యొక్క గుర్తింపును అధికం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు అతను పూర్తి అవగాహనతో, జ్ఞానంతో మహోన్నతుడైన అల్లాహ్ ను ఆరాధిస్తాడు. అతని మనస్సు సంతృప్తి చెందుతుంది. మరియు అరాధనతో అల్లాహ్ సాన్నిహిత్యం ద్వారా మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విధానమును అనుసరించటం ద్వారా అతని విశ్వాసం అధికమవుతుంది.
మరియు అల్లాహ్ తఆలాతో నేను వేడుకునేదేమిటంటే ఆయన ఈ పుస్తకంలోని ప్రతీ పదములో శుభాలను ప్రసాదించుగాక. మరియు వాటి ద్వారా ఆయన ఇస్లాంనకు మరియు ముస్లిములకు ప్రయోజనం కలిగించుగాక. మరియు వాటిని గౌరవోన్నతుడైన ఆయన మన్నత కొరకు ప్రత్యేకించుగాక. మరియు తన ప్రతిఫలమును బ్రతికి ఉన్న, మరణించిన ముస్లిములందరి కొరకు చేయుగాక.
అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులందరిపై శుభాలను, శాంతిని కలిగించుగాక.
ముహమ్మద్ ఇబ్నె అష్షీబ అష్షహరీ
2/11/1441 హి
నా ప్రభువు అల్లాహ్:
మహోన్నతుడు ఇలా సెలవిస్తున్నాడు:
{ఓ మానవులారా! మిమ్మల్ని మరియు మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువు (అల్లాహ్) నే ఆరాధించండి, తద్వారా మీరు భక్తిపరులు కావచ్చు!} [అల్ బఖర: 21]
మహోన్నతుడు ఇలా సెలవిస్తున్నాడు:
{ఆయనే అల్లాహ్ ఆయన తప్ప ఆరాధ్య దైవం లేడు} [అల్ హష్ర్: 22]
మహోన్నతుడు ఇలా సెలవిస్తున్నాడు:
{ఆయనను పోలినదేదీ లేదు మరియు ఆయన సర్వం వినేవాడూ, సర్వం చూసేవాడూను}. [షూరా: 11]
అల్లాహ్ ఆయనే నా ప్రభువు మరియు ప్రతీ దానికి ప్రభువు, యజమాని, సృష్టికర్త, ఆహారొపాధి ప్రసాదకుడు, ప్రతీది నిర్వహించేవాడు.ఆయన ఒక్కడే ఆరాధనకు హక్కుదారుడు. ఆయన తప్ప ప్రభువు లేడు మరియు ఆయన కాకుండా ఎవరు ఆరాధ్య దైవం కాడు.
ఆయన కొరకు అందమైన పేర్లు మరియు ఉన్నతమైన గుణాలు కలవు వేటినైతే ఆయన తన స్వయం కొరకు నిరూపించుకున్నాడో మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన కొరకు నిరూపించారో. అవి పరిపూర్ణతలో, అందములో అత్యంత స్థానాలకు చేరుకున్నవి. ఆయన లాంటిది ఏదీ లేదు. ఆయన వినేవాడు మరియు చూసేవాడూను.
ఆయన అందమైన పేర్లలోంచి :
అర్రజ్జాఖు (ఆహారోపాధి ప్రధాత), అర్రహ్మాను (అనంత కరుణామయుడు), అల్ ఖదీర్ (సామర్ధ్యం కలవాడు), అల్ మలికు (యజమాని), అస్సమీఉ (వినేవాడు), అస్సలాము (శాంతి ప్రధాత), అల్ బసీరు (చూసేవాడు), అల్ వకీలు (కార్యసాధకుడు), అల్ ఖాలిఖు (సృష్టికర్త), అల్లతీఫు (సూక్ష్మ గ్రాహి), అల్ కాఫీ (సరిపోయేవాడు), అల్ గఫూర్ (మన్నించేవాడు).
అల్ రజ్జాఖ్:- దాసుల జీవనోపాధికి బాధ్యత వహించేవాడు, ఆ ఉపాధి ద్వారానే వారి హృదయాలు మరియు శరీరాలు బలాన్నిపొందుతాయి.
అర్రహ్మాను’కరుణామయుడు:- సమస్తాన్ని ఆవరించి ఉన్నమహోన్నత, విశాల, కరుణామయుడు.
అల్ ఖదీరు:- ఆయన సంపూర్ణ శక్తిసామర్థ్యాలను కలిగినవాడు, దానికి (ఆ సామర్థ్యానికి) ఎటువంటి అసమర్థత, బలహీనత, దరిచేరదు.
అల్-మలికు:- ఇది గొప్పతనం, ఆధిక్యత మరియు ప్రణాళిక వంటి లక్షణాలతో వివరించబడింది, సమస్త వస్తువులకు యజమాని, మరియు ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా అమలుపర్చే అధికారి.
సర్వం వినేవాడు :-ఆయనే వినబడే వాటన్నింటిని వాటి గోప్యములను, బాహ్యములను తెలుసుకుంటాడు.
అస్సలాము:- సమస్త లోపాలకు, బలహీనతలకు మరియు దోషాలకు అతీతుడు.
అల్-బసీరు:- ప్రతి దానిని’అది ఎంత చిన్నదైన, రేణువైన కంటి చూపుతో చుట్టుముట్టినవాడు, విషయాలపై అంతర్దృష్టి కలవాడు, సర్వ విషయాలకు నిపుణుడు, అంతర్గత పరిజ్ఞానం కలవాడు.
అల్ వకీలు:- తన సృష్టిజీవనోపాధికి సంరక్షకుడు, వారి ప్రయోజనాలకు బాధ్యుడు, మరియు ఆయనే తన మిత్రులను నియమిస్తాడు వారికి సౌలభ్యాన్ని ప్రసాదిస్తాడు, కష్టకారకాల నుండి రక్షిస్తాడు, వారి వ్యవహారాలకు సరిపోతాడు.
అల్ ఖాలిఖు:- వస్తువులకు ఉనికిని ప్రసాదించువాడు, ఎటువంటి పూర్వప్రణాళిక, నమూనా లేకుండా ఆవిష్కరించువాడు.
అల్లతీఫ్ :- ఆయనే తన దాసులను గౌరవిస్తాడు మరియు వారిపై దయ చూపుతాడు మరియు వారు అర్ధించిన వాటిని వారికి ప్రసాదిస్తాడు.
అల్ కాఫీ:- తన సమస్త దాసులకు మరియు వారికి అవసరమైన అన్నిటికీ సరిపోయేవాడు, మరియు ఆయన సహాయంతో ఇతరులకు సరిపోతాడు మరియు ఇతరులు సంతృప్తి చెందుతారు.
అల్ గఫూరు:- ఆయన తన దాసులను వారి పాపాల నుండి రక్షిస్తాడు మరియు ఆ చర్యలపై వారిని శిక్షించడు.
ఒక ముస్లిం అల్లాహ్ సృష్టి అద్భుతములో మరియు ఆయన సులభతరం చేయటంలో యోచన చేస్తాడు. సృష్టి తమ చిన్న(పిల్లలను) లను చూసుకోవటం వారిని తినిపించటం పై అత్యాస కలిగి ఉండటం దీనిలో నుంచే మరియు వారిని చూసుకోవటం అనేది వారు తమ కాళ్ళపై నిలబడే వరకు. కావున వారి సృష్టికర్త పరిశుద్ధుడు మరియు వారి సూక్ష్మాంశాలను తెలుసుకునేవాడు. మరియు వారి పూర్తి బలహీనత ఉన్నప్పటికి ఆయన వారికి సహాయపడే, వారి పరిస్థితులను చక్కదిద్దే కారకాలను వారికి అందించడం ఆయన సూక్ష్మాంశాలను తెలుసుకోవటంలో నుంచే.
నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం:
మహోన్నతుడు ఇలా సెలవిస్తున్నాడు:
(ఓ ప్రజలారా!) వాస్తవానికి, మీ వద్దకు మీలో నుంచే ఒక సందేశహరుడు (ముహమ్మద్) వచ్చి ఉన్నాడు; మీరు ఆపదకు గురి కావటం అతనికి కష్టం కలిగిస్తుంది; అతను మీ మేలు కోరేవాడు, విశ్వాసుల ఎడల కనికరుడు, కరుణామయుడు. [తౌబ: 128]
మహోన్నతుడు ఇలా సెలవిస్తున్నాడు:
మరియు మేము నిన్ను (ఓ ప్రవక్తా!) సర్వలోకాల వారి కొరకు కారుణ్యంగా మాత్రమే పంపాము. [అల్ అంబియా: 107]
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కారుణ్యముర్తిగా పంపించబడినవారు.
ఆయన ముహమ్మద్ ఇబ్నె అబ్దుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తల, సందేశహరుల పరిసమాప్తకులు. ఆయనను అల్లాహ్ తఆలా ఇస్లాం ధర్మమునిచ్చి ప్రజలందరి వద్దకు పంపించాడు. వారిని మేలు గురించి తెలపటానికి అందులో గొప్పదైనది తౌహీదు (ఏక దైవోపాసన). మరియు వారిని చెడు నుండి వారించటానికి అందులో అత్యంత చెడ్డది షిర్కు.
ఆయన ఆదేశించిన వాటి విషయంలో ఆయనను అనుసరించటం మరియు ఆయన తెలియపరచిన వాటి విషయంలో ఆయనను నమ్మటం మరియు ఆయన వారించిన, మందలించిన వాటి నుండి దూరంగా ఉండటం మరియు ఆయన ధర్మశాసనం చేసిన వాటి ద్వారా మాత్రమే అల్లాహ్ ను ఆరాధించటం అనివార్యము.
ఆయన సందేశం మరియు ఆయన కన్న మునుపటి ప్రవక్తలందరి సందేశం ఎటువంటి సాటి లేకండా ఒక్కడైన అల్లాహ్ ను ఆరాధించటం వైపునకు పిలవటం.
ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క గుణములు :
నిజాయితీ, కరుణ, దయ, సహనం, ధైర్యం, ఔదార్యం, మంచి నడవడిక, న్యాయం, వినయం, క్షమాపణ.
దివ్యఖుర్ఆన్ నా ప్రభువు వాక్కు
మహోన్నతుడు ఇలా సెలవిస్తున్నాడు:
{ఓ మానవులారా! మీ ప్రభువు నుండి మీకు స్పష్టమైన నిదర్శనం వచ్చింది. మరియు మేము మీపై స్పష్టమైన జ్యోతిని (ఈ ఖుర్ఆన్ ను) అవతరింపజేశాము}. [నిసా: 174]
దివ్యఖుర్ఆన్ మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు. దాన్ని ఆయన ప్రజలను చీకట్ల నుంచి వెలుగు వైపుకు తీయటానికి మరియు వారిని సన్మార్గము వైపునకు మార్గదర్శకం చేయటానికి తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపజేశాడు.
దాన్ని చదివేవారికి గొప్ప పుణ్యం ప్రాప్తిస్తుంది. దాని మార్గనిర్దేశం పై ఆచరించే వారు సరైన మార్గం పై నడుస్తారు.
ఇస్లాం మౌలికంశాలను నేను తెలుసుకుంటాను.
ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: ఇస్లాం ఐదు విషయములపై నిర్మితమై ఉన్నది :
1. అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడని సాక్ష్యమివ్వటం.
2. నమాజు నెలకొల్పటం.
3. జకాత్ ఇవ్వటం.
4. రమజాన్ ఉపవాసములుండటం.
5. దైవ గృహము హజ్ చేయటం.
ఇస్లాం మూలస్తంభాలు ప్రతి ముస్లింకు తప్పనిసరి అయిన ఆరాధనలు. మరియు వాటి అనివార్య అవటంను నమ్మటం మరియు వాటన్నింటిని ఆచరించటం ద్వారానే మనిషి యొక్క ఇస్లాం సరి అగును. ఎందుకంటే ఇస్లాం వాటిపై నిర్మితమై ఉన్నది. అందుకనే అవి ఇస్లాం మూలస్తంభాలు అని పిలవబడుతాయి.
మరియు ఈ మూలస్తంభాలు అవి :
మొదటి మౌలికాంశము : అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడని సాక్ష్యమివ్వటం.
మహోన్నతుడు ఇలా సెలవిస్తున్నాడు:-
{అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని నీవు తెలుసుకో} [ముహమ్మద్ : 19]
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:-
{(ఓ ప్రజలారా!) వాస్తవానికి, మీ వద్దకు మీలో నుంచే ఒక సందేశహరుడు (ముహమ్మద్) వచ్చి ఉన్నాడు; మీరు ఆపదకు గురి కావటం అతనికి కష్టం కలిగిస్తుంది; అతను మీ మేలు కోరేవాడు, విశ్వాసుల ఎడల కనికరుడు, కరుణామయుడు}.
[తౌబ :128]
అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని సాక్ష్యమివ్వటం యొక్క అర్థం : అల్లాహ్ తప్ప వేరే వాస్తవ ఆరాధ్యదైవం లేడు.
ముహమ్మద్ అల్లాహ్ ప్రవక్త అని సాక్ష్యమివ్వటం యొక్క అర్థం : ఆయన ఆదేశించిన వాటి విషయంలో ఆయనను అనుసరించటం మరియు ఆయన తెలియపరచిన వాటి విషయంలో ఆయనను నమ్మటం మరియు ఆయన వారించిన, మందలించిన వాటి నుండి దూరంగా ఉండటం మరియు ఆయన ధర్మశాసనం చేసిన వాటి ద్వారా మాత్రమే అల్లాహ్ ను ఆరాధించటం అనివార్యము.
రెండవ మూల స్తంభం : నమజును నెలకొల్పడం.
మహోన్నతుడు ఇలా సెలవిస్తున్నాడు:-
{మరియు మీరు నమజును నెలకొల్పండి}. [అల్ బఖర: 110]
నమాజును నెలకొల్పటం అనేది దాన్ని అల్లాహ్ ధర్మబద్ధం చేసిన విధంగా మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాకు నేర్పించిన విధంగా నిర్వర్తించటంతో అవుతుంది.
మూడవ మూలస్తంభము : జకాత్ చెల్లించడం.
మహోన్నతుడు ఇలా సెలవిస్తున్నాడు:-
{మరియు మీరు జకాత్ చెల్లించండి}. [అల్ బఖర: 110]
v ముస్లిం యోక్క విశ్వాసం సత్యమవుటకు పరీక్షగా మరియు తనపై అనుగ్రహించిన సంపద యొక్క అనుగ్రహమునకు, పేదలకు, అవసరం కలవారికి సహాయము చేసే అనుగ్రహమునకు తన ప్రభువుకు కృతజ్ఞత తెలుపుకోవటానికి అల్లాహ్ తఆలా జకాత్ ను విధిగావించాడు.
v జకాత్ చెల్లించటం అనేది హక్కుదారులకు ఇవ్వటంతో నెరవేరుతుంది.
v అది ధనం నిర్ణీత పరిమాణమునకు చేరినప్పుడు అందులో (ధనంలో) విధిగావించబడిన హక్కు. అల్లాహ్ దివ్యఖుర్ఆన్ లో ప్రస్తావించిన ఎనిమిది రకములకు అది ఇవ్వబడుతుంది. వారిలో నిరుపేదలు మరియు అగత్యపరులు ఉన్నారు.
v దాన్ని నిర్వహించటంలో కారుణ్యము, దయతో జోడించడం మరియు ముస్లిం నైతిక విలువల, అతని సంపదల ప్రక్షాళన చేయటం మరియు పేదల, అగత్యపరుల మనస్సులను సంతృప్తిపరచడం మరియు ముస్లిం సమాజ సభ్యుల మధ్య ప్రేమ, సౌభ్రాతృత్వ బంధాలను బలోపేత చేయడం ఉన్నది. అందుకనే పుణ్య ముస్లిం సంతోష హృదయంతో దాన్ని తీసి సంతోషముతో దాన్ని చెల్లిస్తాడు. ఎందుకంటే అందులో ఇతరుల సంతోషం ఉన్నది.
v నిధి చేయబడ్డ సంపద అయిన బంగారం, వెండి మరియు కరెన్సీ నోట్లు మరియు లాభం పొందే ఉద్దేశముతో అమ్మకానికి, కొనుగోలు చేయటానికి సిద్ధం చేయబడ్డ వ్యాపార సామగ్రి వంటి సంపదల జకాత్ పరిమాణం 2.5% అది కూడా వాటి వెల నిర్ణీత పరిమాణమునకు చేరి వాటిపై పూర్తి ఒక సంవత్సరం గడిచిపోయినప్పుడు.
v అదే విధంగా పశువుల్లో (ఒంటెలు, ఆవుల, గొర్రెలు) నిర్ణీత పరిమాణమునకు యజమాని అయితే అందులో జకాత్ విధిగావించబడుతుంది. అది కూడా అవి మేత సంవత్సరములో చాలా వరకు తమ యజమాని తినిపించకుండా భూమి నుండి గడ్డి మేసినప్పుడు.
v మరియు అదేవిధంగా భూ ఉత్పత్తులైన ధాన్యములు, పండ్లు, గనులు, నిధులలో అవి నిర్ణీత పరిమాణమునకు చేరినప్పుడు వాటిలో జకాత్ విధి అవుతుంది.
నాల్గవ మూలస్తంభం : రమజాను మాసపు ఉపవాసములు ఉండటం.
మహోన్నతుడు ఇలా సెలవిస్తున్నాడు:-
{ఓ విశ్వాసులారా! ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది, ఏ విధంగానైతే మీ పూర్వికులకు విధిగా నిర్ణయించబడి ఉండెనో బహుశా మీరు దైవభీతిపరులై ఉంటారని!} [అల్ బఖ్రా: 110]
రమజాన్ : అది హిజ్రీ క్యాలండరు ప్రకారం సంవత్సరపు తొమ్మిదో నెల. అది ముస్లిముల వద్ద గొప్ప నెల. మరియు దానికి సంవత్సరపు మిగితా నెలల కన్న ప్రత్యేక స్థానం ఉంది. మరియు దాని పూర్తి ఉపవాసములు ఇస్లాం యొక్క ఐదు మూలస్తంభముల్లో ఒకటి.
రమజాన్ మాసపు ఉపవాసముండటం అది : పవిత్ర రమజాన్ మాసం రోజులంతా ఉదయం నుండి సూర్యాస్తమయం వరకు తినటం, త్రాగటం, సంభోగము మరియు ఉపవాసమును భంగపరిచే వాటి నుండి ఆగి ఉండి అల్లాహ్ తఆలా కొరకు ఆరాధన చేయటం.
ఐదవ మూలస్తంభం : అల్లాహ్ పవిత్ర గృహం యొక్క హజ్ చేయటం.
మహోన్నతుడు ఇలా సెలవిస్తున్నాడు:-
అక్కడికి వెళ్ళే స్థోమత గలవారికి ఆ గృహ హజ్ చేయటాన్ని అల్లాహ్ విధిగా చేశాడు.
[ఆలే ఇమ్రాన్: 97]
హజ్ అనేది దాని వైపునకు వెళ్ళే స్థోమత కలిగిన వారి కొరకు జీవితకాలంలో ఒకసారి చేయవలసి ఉంటుంది. మరియు అది ఎలాగంటే నిర్దిష్ట కాలంలో నిర్దిష్ట ఆరాధనలు నిర్వర్తించటం కొరకు మక్కా ముకర్రమాలో ఉన్న పరిశుద్ధ గృహమును మరియు పవిత్ర స్థానాల ఉద్దేశ్యంతో( హజ్ చేయడం). మరియు నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు హజ్ చేశారు. మరియు ఆయన కన్న మునుపటి ప్రవక్తలు హజ్ చేశారు. మరియు అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాంను ప్రజల్లో హజ్ గురించి ప్రకటించమని ఆదేశించాడు.
దాని గురించి అల్లాహ్ దివ్యఖుర్ఆన్ లో తెలియపరచాడు. మరియు ఇలా పలికాడు :
మరియు ప్రజలకు హజ్జ్ యాత్రను గురించి ప్రకటించు : "వారు పాదాచారులగా మరియు ప్రతి బలహీనమైన ఒంటె (సవారీ) మీద, విశాల (దూర) ప్రాంతాల నుండి మరియు కనుమల నుండి నీ వైపుకు వస్తారు. [అల్ హజ్జ్: 27]
ఇస్లాం మౌలికంశాలను నేను తెలుసుకుంటాను.
మరియు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఈమాన్ గురించి ప్రశ్నించబడ్డారు. అప్పుడు ఆయన ఇలా పలికారు :
నీవు అల్లాహ్ పై, ఆయన దూతల పై, ఆయన గ్రంధములపై, ఆయన ప్రవక్తల పై మరియు అంతిమ దినంపై విశ్వాసమును చూపటం మరియు నీవు విధివ్రాతపై దాని మంచి, చెడుపై విశ్వాసము చూపటం.
విశ్వాసమునకు మూలస్తంభాలు అవి ప్రతి ముస్లిం యొక్క మనస్సుకు సంబంధించిన తప్పనిసరి ఆరాధనలు. మరియు మనిషి యొక్క ఇస్లాం వాటిని విశ్వసించటం ద్వారా మాత్రమే సరిఅగును. అందుకనే వాటిని విశ్వాసము యొక్క మూలస్తంభాలు అని పిలవటం జరిగినది. వాటికి మరియు ఇస్లాం మూలస్తంభాలకి మధ్య తేడా ఏమిటంటే ఇస్లాం మూలస్తంభాలు బాహ్యపరమైన ఆచరణలు వాటిని మనిషి తన అవయవములతో నిర్వర్తిస్తాడు. ఉదాహరణకు షహాదతైన్ ను పలకటం, నమాజు, జకాతు. మరియు విశ్వాసం యొక్క మూలస్తంభాలు హృదయమునకు సంబంధించిన ఆచరణలు వాటిని మనిషి తన హృదయంతో నిర్వర్తిస్తాడు. ఉదాహరణకు అల్లాహ్ ను, ఆయన గ్రంధములను, ఆయన ప్రవక్తలను విశ్వసించడం.
విశ్వాసం యొక్క భావము మరియు దాని అర్థం ఏమిటంటే అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంధములను, ఆయన ప్రవక్తలను, అంతిమ దినమును, మంచి, చెడు అయిన విధివ్రాతను హృదయంతో ధృడంగా నమ్మటం. మరియు ప్రవక్త తీసుకుని వచ్చిన దాన్ని మరియు ఆయన అనువర్తనమును అనుసరించటం.
Ø నాలుకతో పలకేవి. ఉదాహరణకు : లా యిలాహ ఇల్లల్లాహ్ పలకటం, ఖుర్ఆన్ పఠించటం, తస్బీహ్ , తహ్లీల్ (లా యిలాహ పలకటం) మరియు అల్లాహ్ స్థుతులను పలకటం.
Ø మరియు బాహ్య అవయవములతో ఆచరించేవి. ఉదాహరణకు : నమాజ్, హజ్జ్, ఉపవాసములు. మరియు హృదయంతో సంబంధం ఉన్న అంతర్గత అవయవములతో ఆచరించేవి. ఉదాహరణకు : అల్లాహ్ ను ప్రేమించడం, ఆయనకు భయపడటం, ఆయనపై నమ్మకం ఉంచటం, ఆయన కొరకు చిత్తశుద్ధి.
మరియు దాన్ని నిపుణులు సంక్షిప్తంగా నిర్వచించారు ఎలాగంటే : మనస్సుతో విశ్వసించడం మరియు నాలుకతో పలకటం, అవయవములతో ఆచరించడం. అది విధేయత చూపటంతో పెరుగుతుంది మరియు అవిధేయత చూపటంతో తరుగుతుంది.
మొదటి మూలస్తంభం : అల్లాహ్ ను విశ్వసించడం.
మహోన్నతుడు ఇలా సెలవిస్తున్నాడు:-
{అల్లాహ్ ను విశ్వసించే వారే విశ్వాసపరులు} [నూర్: 62]
అల్లాహ్ పై విశ్వాసమునకు ఆయన రుబూబియత్ లో, ఆయన ఉలీహియత్ లో ఆయన నామములు, గుణముల్లో ఆయన ఏకత్వము అవసరం. మరియు అది ఈ క్రింది వచ్చే వాటిలో ఉంటుంది :
v పరిశుద్ధుడైన మరియు మహోన్నతుడైన ఆయన ఉనికిపై విశ్వాసం ఉంచడం.
v పరిశుద్ధుడైన మరియు మహోన్నతుడైన ఆయన రుబూబియత్ (ప్రభువు అవటం) పై విశ్వాసం ఉంచడం. మరియు ప్రతీ దాని యజమాని, దాని సృష్టికర్త, దాని ఆహారోపాధకుడు మరియు దాని వ్యవహారమును నడిపేవాడు ఆయనే అని విశ్వసించడం.
v పరిశుద్ధుడైన ఆయన ఉలూహియత్ పై విశ్వాసం ఉంచడం. మరియు ఆయన ఒక్కడే ఆరాధనకు హక్కుదారుడని నమాజు, అర్ధన, మొక్కుబడి, జుబాహ్ చేయటం, సహాయం కోరటం, శరణువేడుకోవటం మరియు ఇతర ఆరాధనలు లాంటి దేనిలోను ఆయనకు సాటి ఎవరూ లేరని విశ్వసించడం.
v ఆయన స్వయంగా తనకోసం నిరూపించుకున్న లేదా ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన కొరకు నిరూపించిన ఆయన మంచి పేర్లను, ఆయన ఉన్నత గుణములను విశ్వసించడం మరియు ఆయన స్వయంగా నిరాకరించిన లేదా ఆయన ప్రవక్త ఆయన నుండి నిరాకరించిన నామములను, గుణములను నిరాకరించడం. మరియు ఆయన నామములు, ఆయన గుణములు పరిపూర్ణతలో, అందంలో అత్యంత స్థానమునకు చేరినవి. మరియు ఆయనను పోలినది ఏదీ లేదు. మరియు ఆయన సర్వం వినేవాడు, చూసేవాడు.
రెండవ మూలస్తంభం : దైవదూతలపై విశ్వాసం ఉంచడం.
మహోన్నతుడు ఇలా సెలవిస్తున్నాడు:- {సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే! ఆకాశాలు మరియు భూమి యొక్క సృష్టికి మూలాధారి. ఆయనే దైవదూతలను సందేశాలు అందజేసేవారిగా నియమించాడు. వారు రెండేసి, మూడేసి లేదా నాలుగేసి రెక్కలు గలవారు. ఆయన తన సృష్టిలో తాను కోరిన దానిని అధికం చేస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు}. [ఫాతిర్ : 1]
దైవదూతలు కనబడని సృష్టి అని మరియు వారు అల్లాహ్ దాసులని ఆయన వారిని కాంతితో సృష్టించాడని మరియు ఆయన వారిని విధేయులుగా, సిరసావహించేవారిగా చేశాడని మేము విశ్వసించాలి.
మరియు వారు ఒక గొప్ప సృష్టి, వారి శక్తిని మరియు వారి సంఖ్యను మహోన్నతుడైన అల్లాహ్ మాత్రమే చుట్టుముట్టి ఉన్నాడు. మరియు వారిలో నుంచి ప్రతి ఒక్కరికి అల్లాహ్ కేటాయించిన వర్ణాలు, పేర్లు మరియు విధులున్నాయి. వారిలో నుంచి దైవవాణి బాధ్యత ఇవ్వబడిన జిబ్రయీల్ అలైహిస్సలాం ఉన్నారు. ఆయన దానిని అల్లాహ్ వద్ద నుండి తీసుకుని ఆయన ప్రవక్తల వద్దకు దిగుతారు.
మూడవ మూలస్తంభం : గ్రంధములను విశ్వసించడం.
మహోన్నతుడు ఇలా సెలవిస్తున్నాడు:-
{(ఓ ముస్లింలారా!) మీరు ఇలా అనండి : "మేము అల్లాహ్ ను మరియు ఆయన మా కొరకు అవతరింపజేసిన సందేశాలను మరియు ఇబ్రాహీమ్, ఇస్మాయీల్, ఇస్ హాఖ్, యాఖూబ్ మరియు అతని సంతతి వారికి ఇవ్వబడిన వాటినీ మరియు మూసా, 'ఈసా మరియు ఇతర ప్రవక్తలందరికీ వారి ప్రభువు తరుపు నుండి ఇవ్వబడిన వాటినీ (సందేశాలను) విశ్వసిస్తాము. వారిలో ఏ ఒక్కరి పట్లా మేము భేదభావం చూపము. మేము ఆయనకు విధేయులం (ముస్లింలం) అయ్యాము"}. [అల్ బఖర :136]
దివ్యగ్రంధములన్ని అల్లాహ్ వాక్కు అని దృఢంగా విశ్వసించడం. మరియు అవి అల్లాహ్ అజ్జవజల్ల వద్ద నుండి ఆయన ప్రవక్తలపై ఆయన దాసుల వైపుకు స్పష్టమైన సత్యంతో అవతరింపబడినవని విశ్వసించడం.
మరియు పరిశుద్ధుడైన అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రజలందరి వద్దకు ప్రవక్తగా పంపించి ఆయన షరీఅతు ద్వారా పూర్వ షరీఅతులన్నిటిని రద్దుపరచాడు. మరియు దివ్యఖుర్ఆన్ ను దివ్యగ్రంధములన్నిటిపై పర్యవేక్షకునిగా మరియు వాటిని రద్దుపరిచేదిగా చేశాడు. మరియు నిశ్చయంగా అల్లాహ్ ఏ రకమైన మార్పు చేర్పుల నుండి దివ్యఖుర్ఆన్ పరిరక్షణ బాధ్యతను తీసుకున్నాడు.
మరియు మహోన్నతుడైన ఆయన ఇలా పలికాడు :
{నిశ్చయంగా, మేమే ఈ జ్ఞాపిక (ఖుర్ఆన్) ను అవతరింప జేశాము మరియు నిశ్చయంగా మేమే దీనిని కాపాడేవారము}. [అల్ హిజ్ర్ :9]
ఎందుకంటే దివ్యఖుర్ఆన్ మానవుల వద్దకు వచ్చిన అల్లాహ్ గ్రంధముల్లోంచి చివరిది. మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తల్లో చిట్టచివరి ప్రవక్త. మరియు ఇస్లాం ధర్మము అల్లాహ్ ప్రళయం స్థాపించబడే వరకు మానవుల కొరకు ఇష్టపడిన ధర్మము.
మహోన్నతుడైన ఆయన ఇలా సెలవిచ్చాడు :
{నిస్సందేహంగా ఇస్లాం యే అల్లాహ్ వద్ద సమ్మతమైన ధర్మం}. [ఆలే ఇమ్రాన్:19]
మరియు మహోన్నతుడైన అల్లాహ్ తన పుస్తకంలో ప్రస్తావించిన దివ్యగ్రంధాలు. అవి :
v దివ్యఖుర్ఆన్: అల్లాహ్ దీనిని తన ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరింపజేశాడు.
v తౌరాత్ : అల్లాహ్ దీనిని తన ప్రవక్త అయిన మూసా అలైహిస్సలాం పై అవతరింపజేశాడు.
v ఇంజీలు : అల్లాహ్ దీనిని తన ప్రవక్త అయిన ఈసా అలైహిస్సలాం పై అవతరింపజేశాడు.
v జబూర్ : అల్లాహ్ దీనిని తన ప్రవక్త అయిన దావూద్ అలైహిస్సలాం పై అవతరింపజేశాడు.
v సుహుఫె ఇబ్రాహీం (ఇబ్రాహీం పుటములు) : అల్లాహ్ వీటిని తన ప్రవక్త అయిన ఇబ్రాహీం అలైహిస్సలాం పై అవతరింపజేశాడు.
నాల్గవ మూలస్తంభం : ప్రవక్తల పై విశ్వాసం ఉంచడం.
మహోన్నతుడు ఇలా సెలవిస్తున్నాడు:-
{నిశ్చయంగా మేము ప్రతీ సముదాయంలో ప్రవక్తను ప్రభవింపచేసాము, [ప్రజలారా] కేవలం అల్లాహ్'ను ఆరాధించండి మరియు తాగూత్ (మిథ్యాదైవాలు) కు దూరంగా ఉండండి}. [అన్-నహల్:36]
అల్లాహ్ తఆలా ప్రతీ సమాజంలో ఒక ప్రవక్తను ఎటువంటి సాటి లేని ఒక్కడైన అల్లాహ్ ఆరాధన చేయటం వైపునకు మరియు మహోన్నతుడైన ఆయనను వదిలి ఆరాధించబడే వాటిని తిరస్కరించటం వైపునకు వారిని పిలిచేవాడిగా పంపించాడని దృఢంగా నమ్మటం.
మరియు వారందరు మానువులు, అల్లాహ్ దాసులని మరియు వారు సత్యవంతులు, దృవీకరించేవారు, భయభీతి కలవారు, నీతిమంతులు, సన్మార్గం చూపేవారు, సన్మార్గం పొందేవారు అని, అల్లాహ్ వారి నిజాయితీపై సూచించే మహిమలతో వారికి మద్దతు కలిగించాడని మరియు వారు దేనినైతే అల్లాహ్ వారికిచ్చి పంపించాడో వాటన్నిటిని చేరవేశారని మరియు వారందరు స్పష్టమైన సత్యముపై, స్పష్టమైన సన్మార్గం పై ఉన్నారని విశ్వసించడం.
ధర్మ మూలం విషయంలో వారిలో (ప్రవక్తలలో) మొదటి వారి నుండి చివరి వారి వరకు వారి పిలుపు ఏకీభవిస్తుంది. మరియు అది ఆరాధన విషయంలో, ఆయనతో పాటు సాటి లేకపోవటంలో అల్లాహ్ అజ్జవజల్ల యొక్క తౌహీదు.
ఐదవ మూలస్తంభం : అంతిమ దినమును విశ్వాసించడం
మహోన్నతుడు ఇలా సెలవిస్తున్నాడు:-
{అల్లాహ్! ఆయన తప్ప వేరే ఆరాధ్యుడు లేడు. ఆయన మిమ్మల్నందరినీ పునరుత్థాన దినమున సమావేశ పరుస్తాడు. అది (రావటంలో) ఏ మాత్రం సందేహం లేదు. మరియు అల్లాహ్ వాక్కు కంటే మరెవరి (వాక్కు) సత్యమైనది?}. [నిసా: 87]
అంతిమ దినమునకు సంబంధించిన వాటన్నిటిని, మన ప్రభువు అజ్జవజల్ల దాని గురించి తన దివ్యగ్రంధములో తెలియపరచిన దాన్ని లేదా మనప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దాని గురించి మనకు తెలియపరచిన దాన్ని దృఢంగా విశ్వసించడం. ఉదాహరణకు: మనిషి మరణం, మరణాంతరం లేపబడటం, మరలి వెళ్ళటం, సిఫారసు చేయటం, త్రాసు, లెక్కతీసుకోవటం, స్వర్గము, నరకము మరియు అంతిమ దినమునకు సంబంధించిన ఇతరత్రా విషయాలు.
ఆరవ మూలస్తంభం : మంచి, చెడు విధివ్రాతను విశ్వసించడం.
మహోన్నతుడు ఇలా సెలవిస్తున్నాడు:-
{నిశ్చయంగా, మేము ప్రతి దానిని ఒక విధి (నిర్ణీత, ఖద్ర్) తో సృష్టించాము}. [అల్ ఖమర్: 49]
ఇహలోకంలో సృష్టిరాసులపై జరిగే సంఘటనలన్ని అల్లాహ్ జ్ఞానముతో మరియు పరిశుద్ధుడైన, మహోన్నతుడైన ఆయన విధివ్రాతతో మరియు ఎటువంటి సాటి లేని ఒక్కడైన పర్యాలోచనతో అని మరియు ఈ విధివ్రాతలన్ని మానవుని సృష్టికి ముందే వ్రాయబడినవని మరియు మానవునికి కోరిక, ఇచ్చ కలదని మరియు వాస్తవానికి అతడు తన కర్మలను చేసేవాడు. కానీ అవన్ని అల్లాహ్ జ్ఞానము నుండి, ఆయన కోరిక నుండి, ఆయన ఇచ్చ నుండి తొలగిపోవని నమ్మకం కలిగి ఉండటం.
విధివ్రాతపై విశ్వాసం నాలుగు స్థాయిలపై ఆధారపడి ఉంటుంది. అవి :
మొదటిది : చుట్టూ ఉన్న అల్లాహ్ విశ్వజ్ఞానాన్ని విశ్వసించడం.
రెండవది : ప్రళయదినం వరకు జరిగే వాటిని అల్లాహ్ వ్రాయటమును విశ్వసించడం.
మూడవది : శాసనమగు అల్లాహ్ చిత్తాన్ని మరియు ఆయన పూర్తి సామర్ధ్యమును విశ్వసించడం. ఆయన కోరుకున్నది జరిగినది.ఆయన కోరనిది జరగలేదు.
నాల్గవది : అల్లాహ్ ప్రతిదానికి సృష్టికర్త అని విశ్వసించడం. అతని సృష్టించడంలో అతనికి భాగస్వామి ఎవడూ లేడు.
నేను వుజూ చేయటమును నేర్చుకుంటాను:
మహోన్నతుడు ఇలా సెలవిస్తున్నాడు:-
నిశ్చయంగా అల్లాహ్ పశ్చాత్తాపపడేవారిని, పారిశుద్ధ్యాన్ని అవలంభించేవారిని ఇష్టపడతాడు. [అల్ బఖరా : 222]
ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: నీవు నా ఈ వుజూ చేసేలా వుజూ చేయి.
నమాజు విషయంలో గొప్పతనము ఏమిటంటే అల్లాహ్ దానికన్న ముందు పరిశుద్ధతను ధర్మబద్ధం చేశాడు. మరియు దాని సరి అవటమునకు దాన్ని ఒక షరతుగా చేశాడు. కావున అది నమాజు తాళము. మరియు దాని ఘనతను గ్రహించడం హృదయమును నమాజు నిర్వర్తించడం కోసం ఆరాటపరుస్తుంది.
ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: పారిశుద్ధ్యము సగ విశ్వాసము. మరియు నమాజు వెలుగు.
ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఎవరైతే ఉత్తమ రీతిలో వుజూ చేస్తారో అతని పాపాలు అతని శరీరం నుండి వైదొలగిపోతాయి.
కావున దాసుడు వుజూ ద్వారా ఇంద్రియ స్వచ్ఛతను మరియు ఈ ఆరాధనను మహోన్నతుడైన అల్లాహ్ కొరకు ప్రత్యేకిస్తూ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మార్గమును అవలంభిస్తూ నిర్వర్తించి నైతిక స్వచ్ఛతను పొందుతూ తన ప్రభువు వైపునకు ముందడుగు వేస్తాడు.
వీటికి వుజూ తప్పనిసరి :
1. నమాజుకి అది ఫర్జ్ నమాజ్ అయినా నఫిల్ నమాజ్ అయినా సమానమే.
2. కాబా యొక్క తవాఫ్ కి (ప్రదక్షణకి)
3. ఖుర్ఆన్ ను ముట్టుకోవటానికి
నేను పరిశుభ్రమైన నీటితో వుజూ చేస్తాను మరియు గుసుల్ చేస్తాను.
పరిశుభ్రమైన నీరు ఏదంటే అది : ఆకాశము నుండి కురిసిన లేదా భూమి నుండి వెలుపలికి పుట్టుకొచ్చిన ప్రతీ నీరు. మరియు అది తన అసలు రూపంలో ఉండాలి. మరియు దాని మూడు గుణాలైన రంగు, రుచి, వాసన నీటి యొక్క పరిశుభ్రతను తొలగించే వస్తువుల్లోంచి ఏ వస్తువుతో మారకూడదు.
నేను వుజూ చేయటమును నేర్చుకుంటాను.
v దశ 1 : సంకల్పము, దాని స్థలము హృదయము. మరియు సంకల్పము యొక్క అర్థం : మహోన్నతుడైన అల్లాహ్ సన్నిహితమునకు ఆరాధన చేయటానికి హృదయ దృఢనిర్ణయం.
v దశ 2 : రెండు అరచేతులను కడగటం.
v దశ 3 : పుక్కిలించటం.
v పుక్కిలించటం ఎలాగంటే అది : నీటిని నోటిలోకి తీసుకుని దాన్ని లోపల త్రిప్పి మరల దాన్ని బయటకు తీయటం.
v దశ 4 : ముక్కును ఛీదరించటం.
§ ముక్కును ఛీదరించటం ఎలాగంటే నీటిని ముక్కులో చివరి వరకు శ్వాస ద్వారా లోపలికి పీల్చటం.
§ ఆ తరువాత ఛీదరించటం ఎలాగంటే ముక్కులో ఉన్న శ్లేష్మం మరియు ఇతరవాటిని శ్వాస ద్వారా బయటకు తీయటం.
v దశ 5 : ముఖమును కడగటం
ముఖము యొక్క హద్దు
§ ముఖము అన్నది దేనితోనైతే ఒకరినొకరు అభిముఖమవటం జరుగతుందో అది.
§ వెడల్పున దాని హద్దు : చెవి నుండి చెవి వరకు.
§ పొడవున దాని హద్దు తల యొక్క సాధారణ వెంట్రుకలు మొలసే చోటు నుండి గడ్డం చివరి వరకు మధ్య ఉన్న భాగం.
§ తేలికపాటి వెంట్రుకలు ఉన్న చోటు ముఖమును కడగటంలోకి వస్తాయి. మరియు అలాగే తెల్లదనం (అల్ బయాజ్), ఇజార్ (బుగ్గ) కూడాను.
§ తెల్లదనం (అంటే) ఇజార్ మరియు చెవి క్రింద భాగమునకు మధ్య భాగము.
§ మరియు ఇజార్ అంటే పొంగి వచ్చిన ఎముకపై ఉన్న వెంట్రుకలు, చెవి రంద్రము ఉన్న ప్రదేశమునకు సమాంతరంగా తల వరకు ఉన్న భాగము.
§ మరియు అలాగే గడ్డము యొక్క దట్టమైన వెంట్రుకలు దాని నుండి వ్రేలాడేవి కూడా ముఖమును కడగటంలోకి వస్తాయి.
v దశ 6 : రెండు చేతుల వేళ్ళ తల భాగముల నుండి రెండు మోచేతుల వరకు రెండు చేతులను కడగటం.
v మరియు రెండు మోచేతులు రెండు చేతులను కడిగే విధిలో వస్తాయి.
v దశ 7 : రెండు చెవులతో సహా పూర్తి తలను ఒకసారి రెండు చేతులతో మసహ్ చేయటం.
§ తల ముందు భాగం నుండి మొదలు చేసి దాని వెనుక భాగము వరకు వాటిని (రెండు చేతులు) తీసుకుని పోవాలి. ఆ తరువాత వాటిని మరల్చాలి.
§ మరియు తన చూపుడు వేలును తన రెండు చెవులలోకి దూర్చాలి.
§ మరియు తన రెండు బొటన వేళ్ళను తన రెండు చెవుల బాహ్య భాగముపై పోనిచ్చి వాటితో చెవుల బాహ్య భాగముపై మసహ్ చేయాలి.
v దశ 8 : రెండు కాళ్ళను వేళ్ళ మొదలు నుండి రెండు కాళ్ళ గిలకల వరకు కడగటం. రెండు కాళ్ళ గిలకలను కడగటం రెండు కాళ్ళను కడిగే విధిలోకి వస్తుంది.
§ గిలకలు అంటే కాలి పిక్క క్రింది భాగములో వెలుపలికి పొంగిన రెండు ఎముకలు.
ఈ విషయాలు వుజూను భంగపరుస్తాయి.
1. మూత్రం, మలము, గాలి, మనీ (వీర్యం), మజీ (పురుషాంగము నుండి వెలువడే పలుచటి జిగురు పదార్థం) లాంటివి రెండు మార్గముల నుండి వెలువడేవి.
2. గాఢ నిద్ర వలన లేదా స్ప్రహ కోల్పోవటం వలన లేదా మత్తు వలన లేదా పిచ్చితనం వలన బుద్ధిని కోల్పోవటం.
3. జనాబత్ (సంభోగము వలన వీర్య స్ఖలనం అయిన పరిస్థితి), రుతుస్రావం, పురిటి రక్తం లాంటి గుసుల్ ను అనివార్యం చేసే ప్రతీది.
మనిషి కాలకృత్యములు తీర్చుకున్న తరువాత మలినమును పరిశుభ్రమైన నీటితో తొలగించటం అతని పై తప్పనిసరి. ఇది మంచిది. లేదా పరిశుభ్రమైన నీరు కాకుండా రాళ్ళు, ఆకులు, వస్త్రం లాంటివి మరియు అలాంటివే ఇతర మలినమును తొలగించే వాటితో మాలిన్యమును తొలగించుకోవాలి. అది మూడు తుడిచే పరిశుభ్రమైనవి లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. మరియు పరిశుభ్రమైన దానితో (మలినమును తొలగించటం) మంచిది.
మేజోళ్లపై, పాదకూసములపై మసహ్ చేయటం
మేజోళ్ళను లేదా పాదకూసములను తొడిగినప్పుడు రెండు కాళ్ళను కడిగే అవసరం లేకుండా కొన్ని షరతులతో వాటిపై మసహ్ చేసుకోవచ్చు. అవి :
1. చిన్న మాలిన్యము, పెద్ద మాలిన్యము నుండి ఎందులోనైతే కాళ్ళు కడగబడుతాయో పూర్తి శుభ్రత తరువాత వాటిని (మేజోళ్ళను) తొడిగి ఉండటం.
2. అవి రెండు పరిశుభ్రంగా ఉండాలి. వాటికి మలినము ఉండకూడదు.
3. మసహ్ అన్నది దాని నిర్ణీత కాలములో అయి ఉండాలి.
4. అవి హలాల్ అయినవి ఉండాలి. అవి దొంగలించబడిన లేదా బలవంతాన లాక్కున్నటువంటివి కాకూడదు.
5. రెండు ఖుఫ్ లు (మేజోళ్ళు) అంటే పల్చటి చర్మం, అలాంటి వాటితో చేయబడి కాళ్ళలో తొడగబడేవి. రండు కాళ్ళను కప్పే బూట్లు వాటి లాంటివే.
రెండు జవ్రబ్ లు (పాదకూసములు) అంటే వస్త్రంతో, అటువంటి వాటితో చేయబడినవి ఏవైతే మనిషి తన రెండు కాళ్ళలో తొడుగుతాడో. మరియు అవి అష్షరాబ్ (పానియం) పేరుతో పిలవబడుతాయి.
రెండు మేజోళ్ళపై మసహ్ చేయటం యొక్క ధర్మబద్ధత యొక్క విజ్ఞత
మేజోళ్ళపై మరియు పాదకూసములపై మసహ్ చేయటం యొక్క విజ్ఞత ఏమిటంటే ముస్లిములపై సులభతరం చేయటం మరియు తేలిక చేయటం. ఎవరికైతే మేజోళ్ళను, పాదకూసములను తీసి రెండు కాళ్ళను కడగటం కష్టమవుతుందో ముఖ్యంగా శీతాకాలం, తీవ్ర చలి సమయాల్లో మరియు ప్రయాణంలో.
మసహ్ యొక్క కాలం (కాలవ్యవధి)
v స్థానికుడికి ఒక పగలు, ఒక రేయి (24 గంటలు)
v ప్రయాణికుడికి మూడు పగలులు, వాటి రాత్రులు (72 గంటలు)
మేజోళ్ళపై లేదా పాదకూసములపై వుజూ భంగమై వుజూ చేసి మొదట మసహ్ చేసినప్పటి నుండి మసహ్ కాలవ్యవధి లెక్కింపు ప్రారంభమవుతుంది.
మేజోళ్ళపై లేదా పాదకూసములపై మసహ్ చేసే పధ్ధతి :
1) రెండు చేతులను తడి చేసుకోవాలి.
2) చెయ్యి పాదము యొక్క పై భాగముపై తీసుకుపోవాలి (కాలి వేళ్ళ కొనల నుంచి పిక్క మొదలు వరకు).
కుడి కాలును కుడి చేతితో మరియు ఎడమ కాలును ఎడమ చేతితో మసహ్ చేయాలి.
మసహ్ ను భంగపరిచేవి :
1. గుసుల్ ను అనివార్యం చేసేవి.
2. మసహ్ కాలం ముగియటం
అల్ గుసుల్ -షరీఅతు బద్దమైన స్నానం.
పురుషుడు లేదా స్త్రీ సంభోగం చేసినట్లయితే లేదా మేల్కొన్న స్థితిలో లేదా నిద్ర స్థితిలో కామ కోరికతో వారి నుండి వీర్యస్ఖలనమైనప్పుడు వారు నమాజు నెరవేర్చడానికి నిర్ణయించుకుంటే లేదా దేనికోసమైన పరిశుద్ధతను పాటించటం తప్పనిసరి అయినప్పుడు వారిపై గుసుల్ తప్పనిసరి అవుతుంది. మరియు ఇదే విధంగా స్త్రీ ఋతుస్రావం, పురుటిరక్తం నుండి పరిశుద్ధత పొందినప్పుడు ఆమె నమాజును నెరవేర్చే నిర్ణయం తీసుకొనక ముందు లేదా దేనికైనా పరిశుద్ధత పాటించటం తప్పనిసరి అవకముందే ఆమెపై గుసుల్ అనివార్యమవుతుంది.
గుసుల్ యొక్క పధ్ధతి క్రింద వచ్చిన విధంగా (ఉండాలి).
ముస్లిం తన శరీరం మొత్తాన్ని ఏ విధంగానైనా నీటితో సాధారణీకరించాలి. అందులో నుంచి పుక్కిలించటం, ముక్కులో నీటిని పీల్చటం. తన శరీరమును నీటితో సాధారణీకరించుకున్నప్పుడు అతని నుండి పెద్ద అశుద్ధత తొలగిపోతుంది. మరియు అతని పరిశుభ్రత పూర్తవుతుంది.
అశుద్ధావస్తలో ఉన్న వారి పై గుసుల్ చేయనంతవరకు ఈ క్రిందివి చేయటం నిషేధము.
1. నమాజు
2. కాబా యొక్క తవాఫ్ (ప్రధక్షణకి)
3. మస్జిద్ లో బస చేయడం. మరియు బస చేయకుండా కేవలం దాటివెళ్ళటము అతనకి సమ్మతము.
4. ఖుర్ఆన్ ను ముట్టుకోవటం
5. ఖుర్ఆన్ చదవటం
తయమ్ముమ్
ముస్లిం పరిశుద్ధతను పొందే నీటిని పొందనప్పుడు లేదా అనారోగ్యం వలన లేదా అటువంటిదే ఏదైన కారణం చేత నీటిని వాడలేకపోయినప్పుడు అతనికి నమాజు కోల్పోయే భయం ఉంటే అతడు పరిశుభ్రమైన మట్టితో తయమ్ముమ్ చేసుకోవాలి.
అదెలాగంటే రెండు చేతులను ఒక సారి మట్టిపై కొట్టి వాటితో ముఖముపై మరియు చేతులపై మసహ్ చేసుకోవాలి. మట్టి పరిశుభ్రంగా ఉండటం తప్పనిసరి.
ఈ విషయాలు తయమ్ముమును భంగపరుస్తాయి.
1) దేనితోనైతే వుజూ భంగమవుతుందో దానితో తయమ్ముమ్ భంగమవుతుంది.
2) ఏ ఆరాధన కొరకు తయమ్ముమ్ చేయబడినదో ఆ ఆరాధన ఆరంభం చేయక ముందే నీరు లభించినప్పుడు.
నేను నమాజు చేయటమును నేర్చుకుంటాను.
అల్లాహ్ ముస్లిం పై రేయింబవళ్లలో ఐదు నమాజులను విధి చేశాడు. మరియు అవి ఫజర్, జుహర్, అసర్, మగ్రిబ్ మరియు ఇషా.
నేను నమాజు చేయటానికి సిద్ధమవుతున్నాను.
నమాజు సమయం ఆసన్నమైనప్పుడు ముస్లిం చిన్న అశుద్ధత నుండి మరియు పెద్ద అశుద్ధత నుండి పరిశుభ్రతను పాటించాలి. ఒక వేళ అశుద్ధావస్తకు గురైన వ్యక్తి పెద్ద అశుద్ధతకు గురైనా.
§ పెద్ద అశుద్ధత ఏమిటంటే ముస్లింపై గుసుల్ ను తప్పనిసరి చేసేది.
§ చిన్న అశుద్ధత ఏమిటంటే ముస్లింపై వుజూను తప్పనిసరి చేసేది.
v ముస్లిం పరిశుభ్రమైన బట్టలు వేసుకుని, అశుద్ధతల నుండి(దూరంగా ఉంటూ) పరిశుభ్రమైన స్థలంలో తన మర్మావయవాలను కప్పుకుని నమాజు చేస్తాడు.
v నమాజ్ వేళ ముస్లిం సరైన మంచి దుస్తులను ధరిస్తాడు. మరియు వాటితో తన శరీరమును కప్పుకుంటాడు. నమాజ్ లో నాబికి మరియు మోకాళ్ళకి మధ్య ఉన్న దేనిని బయటకు కనబడేటట్లు ఉంచటం పురుషునికి సమ్మతం కాదు.
v స్త్రీ ముఖము, అరచేతులు తప్ప తన పూర్తి శరీరమును నమాజులో కప్పుకోవటం తప్పనిసరి.
v ఒక ముస్లిం నమాజులో దానికి ప్రత్యేకించిన సూక్తులు తప్ప వేరేవి మాట్లాడకూడదు. మరియు ఇమామ్ చదివేది అతను శ్రద్ధగా వినాలి. మరియు ఒక వేళ అతనికి నమాజుకు ప్రత్యేకించిన సూక్తులు గుర్తుండకపోతే అతడు నమాజు ముగించే వరకు అల్లాహ్ స్మరణ చేయాలి మరియు ఆయన పరిశుద్ధతను కొనియాడాలి. అతను నమాజు మరియు దాని సూక్తులను నేర్చుకోవటానికి చొరవతీసుకోవాలి.
నేను నమాజు చేయటమును నేర్చుకుంటాను.
దశ 1 : నేను నిర్వర్తించాలని కోరుకుంటున్న విధి కొరకు సంకల్పము అవసరం. దాని స్థానం హృదయం.
నేను వుజూ చేసుకున్న తరువాత ఖిబ్లాకి అభిముఖమై నిలబడాలి. మరియు నేను నిలబడగలిగితే నమాజును
నిలబడి చదవాలి.
దశ 2 : నేను నా రెండు చేతులను ముండెములకు సమాంతరంగా ఎత్తి నమాజులో ప్రవేశమును సంకల్పించుకుంటూ
అల్లాహు అక్బర్ అని పలకాలి.
దశ 3 : హదీసులో వచ్చిన ఇస్తిఫ్తాహ్ దుఆను చదవాలి.
ఆ సూక్తులు ఇవి :
సుబ్హానకల్లాహుమ్మ వబిహమ్దిక వతబారకస్ముక వతఆలా జద్దుక వలా ఇలాహ గైరుక.
దశ 4 : ధూత్కరించబడిన షైతాను నుండి అల్లాహ్ తో శరణు వేడుకోవాలి. ఇలా పలకాలి :
(అఊజుబిల్లాహి మినష్షైతానిర్రజీమ్)
శాపగ్రస్తుడైన షైతాన్ నుండి అల్లాహ్ శరణు కోరుతున్నాను.
దశ 5 : ప్రతీ రకాతులో ఫాతిహా సూరాను పఠించాలి. మరియు అది :
అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో
(1) స్థుతులన్ని సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కొరకే.(2) అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు (3) తీర్పుదినానికి స్వామి (4) మేము నిన్నే ఆరాధిస్తున్నాము మరియు నీ సహాయాన్నే అర్థిస్తున్నాము.(5) మాకు ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేయి.(6) నీవు అనుగ్రహించిన వారి మార్గం మాత్రమే (చూపు) నీ ఆగ్రహానికి గురి అయిన వారి (మార్గం కానీ) లేక మార్గభ్రష్టులైన వారి (మార్గం కానీ) కాదు.(7)
ఫాతిహా తరువాత ఖుర్ఆన్ నుండి అందుబాటులో ఉన్నదాన్ని ప్రతి నమాజులో మొదటి రెండు రకాతులలో మాత్రమే చదవాలి. మరియు ఇది తప్పనిసరి కాదు. కాని అలా చేయటంలో గొప్ప ప్రతిఫలం కలదు.
దశ 6 : అల్లాహు అక్బర్ అని పలికి ఆ తరువాత వీపును సమాంతరంగా ఉంచుతూ మరియు రెండు చేతులను వేళ్ళను
ఎడంగా ఉంచుతూ రెండు మోకాళ్ళపై ఉండేటట్లు ఉంచుతూ రుకూ చేయాలి.
ఆ తరువాత రుకూలో సుబ్హాన రబ్బియల్ అజీమ్ పఠించాలి.
దశ 7 : సమిఅల్లాహు లిమన్ హమిదహ్ అని పలుకుతూ రెండు చేతులను రెండు మొండెములకు సమాంతరంగా
ఎత్తుతూ రుకూ నుండి లెగాలి. శరీరం నిటారుగా నిలబడినప్పుడు రబ్బనా వలకల్ హమ్ద్ అని పలకాలి.
దశ 8 : అల్లాహు అక్బర్ అని పలికి రెండు చేతుల పై, రెండు మోకాళ్ళపై, నుదుటిపై, ముక్కుపై సజ్దా చేయాలి. మరియు
సజ్దాలో సుబ్హాన రబ్బియల్ అఅ్ లా అని పలకాలి.
దశ 9 : అల్లాహు అక్బర్ అని పలికి సజ్దా నుండి లేవాలి వీపును తిన్నగా ఉంచుతు ఎడమ కాలి పై కూర్చుని
కుడికాలును నిలబెట్టాలి. మరియు రబ్బిగ్ఫిర్లీ అని చదవాలి.
దశ 10 : అల్లాహు అక్బర్ అని పలికి మొదటి సజ్దా వలే ఇంకొకసారి సజ్దా చేయాలి.
దశ 11 : అల్లాహు అక్బర్ అని పలుకుతూ సజ్దా నుండి పైకి లెగాలి. చివరికి నిటారుగా నిలబడాలి. మరియు మొదటి
రకాతులో చేసినట్లే నమాజు యొక్క మిగతా రకాతుల్లో చేయాలి.
జుహర్, అసర్, మగ్రిబ్, ఇషా నమాజు రెండవ రకాతు తరువాత మొదటి తషహ్హుద్ చదవటం కొరకు కూర్చోవాలి. మరియు అది :
అత్తహియ్యాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాతు, అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు, వ రహ్మతుల్లాహి వ బరకాతుహు, అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్సాలిహీన్, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు, వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహు.
మరల దీని తరువాత మూడవ రకాతు కొరకు నిలబడాలి.
అన్నీ నమాజుల్లో చివరి రకాతు తరువాత చివరి తషహ్హుద్ చదవటం కొరకు కూర్చోవాలి.
మరియు అది :
అత్తహియ్యాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాతు, అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు, వ రహ్మతుల్లాహి వ బరకాతుహు, అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్సాలిహీన్, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు, వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహు. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్.
దశ 12 : దీని తరువాత నమాజు నుండి బయటకు వచ్చే సంకల్పము చేసుకుని అస్సలాము అలైకుమ్
వరహ్మతుల్లాహ్ అని పలుకుతూ కుడి వైపునకు సలాం తిరగాలి. మరియు అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహ్ అని పలుకుతూ ఎడమ వైపునకు సలాం తిరగాలి.
ముస్లిం మహిళ పరదా:
మహోన్నతుడు ఇలా సెలవిస్తున్నాడు:-
ఓ ప్రవక్తా! నీ భార్యలతో, నీ కుమార్తెలతో మరియు విశ్వాసినులైన స్త్రీలతోనూ తమ దుప్పట్లను తమ మీద పూర్తిగా కప్పుకోమని చెప్పు. ఇది వారు గుర్తించబడి బాధింపబడకుండా ఉండటానికి ఎంతో సముచితమైనది. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రధాత. [అల్ అహ్జాబ్ : 59]
ముస్లిం స్త్రీ పై అల్లాహ్ పరదాను మరియు ఆమె తన మర్మావయవాలను, తన పూర్తి శరీరమును పరాయి పురుషుల నుండి తమ ప్రాంతములో ఉండే సాధారణ దుస్తులతో కప్పుకోవటం అనివార్యం చేశాడు. మరియు ఆమె తన పరదాను తన భర్త లేదా తన మహారిమ్ ల ముందు తప్ప ఇతరుల ముందు విడవటం సమ్మతం కాదు. వారెవరంటే ముస్లిం స్త్రీకి వారితో వివాహం చేయటం ఎన్నటికి సమ్మతం కాదు. మరియు వారు : తండ్రి మరియు ఆపై ఉన్నవారు మరియు కుమారుడు ఇంకా క్రింద వారు (కుమారుడి కొడుకు, కుమారుని కొడుకు కొడుకు) మరియు పినతండ్రులు, మేనమామలు, సోదరుడు, సోదరుడి కుమారుడు, సోదరి కుమారుడు, తల్లి భర్త, భర్త తండ్రి, ఇంకా ఆపై ఉన్నవారు, భర్త కుమారుడు, ఇంకా క్రింద ఉన్న వారు, పాలు త్రాగటం వలన ఏర్పడ్డ సోదరుడు, పాలు త్రాపించిన స్త్రీ భర్త. మరియు బంధుత్వం వలన నిషేధమైనవి పాలు త్రాగటం వలన నిషేధమవుతాయి.
ముస్లిం స్త్రీ తన దుస్తుల విషయంలో చాలా నియమాలను లక్ష్యపెట్టాలి.
మొదటిది : పూర్తి శరీరమును కప్పాలి.
రెండవది : స్త్రీ ధరించేది అలంకరణ కొరకు కాకూడదు.
మూడవది : అవి శరీరం బయటకు కనబడే విధంగా పల్చగా ఉండకూడదు.
నాల్గవది : శరీరం కనబడే విధంగా బిగుతువుగా కాకుండా వదులుగా ఉండాలి.
ఐదవది : సువాసన వెదజల్లేదై ఉండకూడదు.
ఆరవది : మగవారి దుస్తులను పోలి ఉండకూడదు.
ఏడవది : ముస్లిమేతర మహిళల ఆరాధన లేదా వారి పండుగల దుస్తులను పోలి ఉండకూడదు.
విశ్వాసపరుని లక్షణాలు
మహోన్నతుడు ఇలా సెలవిస్తున్నాడు:-
నిశ్చయంగా, విశ్వాసులైన వారి హృదయాలు అల్లాహ్ ప్రస్తావన వచ్చినపుడు భయంతో వణుకుతాయి. మరియు వారి ముందు ఆయన ఆయతులు పఠింపబడినప్పుడు వారి విశ్వాసం మరింత అధికమవుతుంది. మరియు వారు తమ ప్రభువు మీదే దృఢనమ్మకం కలిగి ఉంటారు. [అల్ అన్ఫాల్: 2]
v తను మాట్లాడటంలో సత్యవంతుడై ఉంటాడు మరియు అబద్దం పలకడు.
v ప్రమాణమును మరియు వాగ్దానమును పూర్తిచేస్తాడు.
v తగువులాటలో బూతులాడడు, అబద్దం పలకడు.
v అమానత్ ను నెరవేరుస్తాడు.
v తన కొరకు ఏదైతే ఇష్టపడుతాడో దానినే తన ముస్లిం సోదరుని కొరకు ఇష్టపడుతాడు.
v ఉదార స్వభావుడై ఉంటాడు.
v ప్రజలతో మంచిగా మెలుగుతాడు.
v బంధుత్వాలను కలపుతాడు.
v అల్లాహ్ విధివ్రాత పట్ల సంతుష్టపడుతాడు. మరియు కలిమిలో ఆయనకు కృతజ్ఞత తెలుపుకుంటాడు మరియు లేమిలో సహనం చూపుతాడు.
v సిగ్గు కలవాడై ఉంటాడు.
v సృష్టితాలపై దయామయుడై ఉంటాడు.
v అతని హృదయం ద్వేష వైరముల నుండి నిర్మలమై ఉంటుంది మరియు అతని అవయవములు ఇతరులపై దాడి చేయటం నుండి సురక్షితంగా ఉంటాయి.
v ప్రజలను క్షమించివేస్తాడు.
v అతను వడ్డీ సొమ్ము తినడు మరియు దానితో వ్యవహరించడు.
v వ్యభిచరించడు.
v మద్యం సేవించడు.
v తన పొరుగువారితో మంచిగా మెలుగుతాడు.
v అతను అన్యాయం చేయడు మరియు ద్రోహానికి పాల్పడడు.
v అతను దొంగలించడు మరియు మోసం చేయడు.
v తన తల్లిదండ్రులు ముస్లిమేతరులైనప్పటికి వారితో మంచిగా మెలుగుతాడు. మరియు మంచి కార్యములలో వారికి విధేయత చూపుతాడు.
v తన సంతానమును మంచి నడవడికపై పోషిస్తాడు. మరియు వారికి ధర్మబద్ధమైన విధుల గురించి ఆదేశిస్తాడు. మరియు వారిని దుర్గుణాల నుండి, నిషేధాల నుండి వారిస్తాడు.
v అతను ముస్లిమేతరుల వారి మతపరమైన లక్షణాలలో లేదా వారి ప్రత్యేకత, చిహ్నంగా మారిన అలవాట్లలో పోలి ఉండడు.
నా ఇస్లాం ధర్మంలో నా సౌజన్యము :
మహోన్నతుడు ఇలా సెలవిస్తున్నాడు:-
ఏ పురుషుడు గానీ, లేక స్త్రీ గానీ విశ్వాసులై, సత్కార్యాలు చేస్తే, అలాంటి వారిని మేము తప్పక (ఇహలోకంలో) మంచి జీవితం గడిపేలా చేస్తాము. మరియు వారికి (పరలోకంలో) వారు చేసిన సత్కార్యాలకు ఉత్తమ ప్రతిఫలం తప్పక ప్రసాదిస్తాము. [అన్-నహ్ల్: 97]
ఒక ముస్లిం హృదయంలో సంతోషమును, మనశ్శాంతిని, శుభమును ప్రవేశింపజేసే పెద్ద విషయము: అతను సజీవులు లేదా మృతులు లేదా విగ్రహాల ద్వారా కాకుండా అల్లాహ్ తో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండటం. కాబట్టి అల్లాహ్ తన దివ్య గ్రంధంలో తాను తన దాసులకు నిత్యం దగ్గరగా ఉంటాడని తెలియపరచాడు. ఆయన వారిని వింటాడు మరియు వారి దుఆలను స్వీకరిస్తాడు. ఏ విధంగానైతే ఆయన తెలియపరచాడో :
మరియు నా దాసులు, నా గురించి నిన్ను అడిగితే :"నేను (వారికి) అతి సమీపంలోనే ఉన్నాను. పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపు విని, జవాబిస్తాను. కాబట్టి వారు సరైన మార్గం పొందటానికి, నా ఆజ్ఞను అనుసరించాలి మరియు నా యందు విశ్వాసం కలిగి ఉండాలి" అని చెప్పు. [అల్ బఖరా: 186]
మరియు అల్లాహ్ తనను వేడుకోవటం గురించి మనకు ఆదేశించాడు. మరియు ఆయన ఈ ఆదేశమును ఒక ముస్లిం తన ప్రభువునకు దగ్గర అయ్యే గొప్ప ఆరాధనలలోంచి చేశాడు.
అందుకనే గౌరవోన్నతుడైన ఆయన ఇలా సెలవిచ్చాడు :
మరియు మీ ప్రభువు ఏమంటున్నాడంటే మీరు నన్నే ప్రార్ధించండి. నేను మీ ప్రార్ధనలను ఆమోదిస్తాను. [గాఫిర్ : 60]
కావున ఒక పుణ్యాత్ముడైన ముస్లిం ఎల్లప్పుడు తన ప్రభువు అవసరం కలవాడై ఉంటాడు. మరియు ఎల్లప్పుడు అతని ముందు అర్ధిస్తాడు. మరియు పుణ్య ఆరాధనల ద్వారా ఆయన వైపు దగ్గరత్వాన్ని పొందుతాడు.
మరియు అల్లాహ్ తఆలా ఒక గొప్ప విజ్ఞత కొరకు ఈ విశ్వంలో మమ్మల్ని సృష్టించాడు. మరియు మమ్మల్ని వృధాగా సృష్టించ లేదు. అదేమిటంటే ఎటువంటి సాటి లేని ఒక్కడైన ఆయన ఆరాధన. మరియు ఆయన మన జీవితము యొక్క ప్రత్యేక, సార్వజనిక వ్వవహారాలన్నింటిని నియంత్రించే సమగ్రమైన దైవిక ధర్మమును మా కొరకు ధర్మంగా నియమించాడు. మరియు ఆయన ఈ న్యాయపూరితమైన ధర్మము ద్వారా జీవిత అవసరాలైన మన ధర్మమును, ప్రాణములను, మన మానములను, మన బుద్దులను, మన సంపదలను పరిరక్షించాడు. మరియు ఎవరైతే ధర్మ ఆదేశాలను అనుసరిస్తూ, నిషేధితాల నుండి దూరంగా ఉంటూ జీవితం గడుపుతాడో అతడు ఈ అవసరాలను పరిరక్షించాడు. మరియు తన జీవితంలో ఎటువంటి సందేహం లేకుండా మనశ్శాంతితో సంతోషముగా జీవించాడు.
మరియు తన ప్రభువుతో మస్లిం అనుబంధము లోతైనది. అది మనశ్శాంతి మరియు మానసిక సౌకర్యము, సంతృప్తి, శాంతి, ఆనందము యొక్క భావనను మరియు ప్రభువు యొక్క తోడు మరియు ఆయన కరుణ కటాక్షములు మరియు విశ్వాసపరుడైన తన దాసుని కొరకు తన స్నేహము యొక్క భావనను రేకెత్తిస్తుంది. మహోన్నతుడైన ఆయన ఇలా సెలవిచ్చాడు :
విశ్వసించినవారి సంరక్షకునిగా స్వయంగా అల్లాహ్ ఉంటాడు. ఆయన వారిని చీకట్ల నుంచి వెలుగు వైపుకు తీసుకుపోతాడు. [అల్ బఖర: 257]
ఇది గొప్ప అనుబంధము అది భావోద్వేగ పరిస్థితి. అది కరుణామయుడి ఆరాధనను మంచిగా చేయటంపై మరియు ఆయనను కలసుకునే ఆసక్తిపై ప్రేరేపిస్తుంది. మరియు అది అతని హృదయమును విశ్వాసము యొక్క మాధుర్యము యొక్క అతని భావనతో శుభము యొక్క ఆకాశములో త్రిప్పుతుంది.ఈ మాధుర్యము విధేయత కార్యాలను చేసి, పాపకార్యాలను విడనాడి దాని రుచి చూసిన వారు మాత్రమే దానిని వర్ణించటం సాధ్యమగును. అందుకనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు :
అల్లాహ్ ను ప్రభువుగా, ఇస్లాంను ధర్మంగా మరియు ముహమ్మద్ ను ప్రవక్తగా అంగీకరించిన వాడే విశ్వాస రుచిని చూశాడు.
అవును మనిషి తన సృష్టికర్త ముందట తన శాశ్వత సమక్షికమును భావించినప్పుడు మరియు ఆయన మంచి పేర్లతో, గుణాలతో ఆయనను గుర్తించినప్పుడు మరియు ఆయనను ఆరాధించినప్పుడు ఆయనను చూస్తున్నట్లు మరియు తన ఆరాధన చేయటమును అల్లాహ్ కొరకు ప్రత్యేకించినప్పుడు మరియు అల్లాహ్ తప్ప ఇతరులను దానిలో భావించకుండా ఉన్నప్పుడు అతను ఇహలోకంలో ఆనందపూరితమైన, మంచి జీవితాన్ని జీవించాడు. మరియు పరలోకంలో అతని పరిణామము మంచిగా ఉంటుంది.
చివరికి ఇహలోకంలో విశ్వాసపరునిపై వచ్చిపడే విపత్తులు కూడా. నిశ్ఛయంగా వాటి వేడి నమ్మకము యొక్క చల్లదనముతో మరియు అల్లాహ్ యొక్క విధివ్రాత పట్ల సంతుష్టపడటంతో మరియు ఆయన మంచి, చెడు విధివ్రాతలన్నిటిపై ఆయన స్థుతులను పలకటంతో మరియు వాటి పట్ల పరిపూర్ణ సంతృప్తితో తొలగిపోవును.
ఒక ముస్లిం తన శుభమును, తన మనశ్శాంతిని అధికం చేయటం కోసం ఆసక్తి చూపవలసిన విషయం ఏమిటంటే అల్లాహ్ కొరకు తన స్మరణను మరియు దివ్యఖుర్ఆన్ పఠనమును అధికం చేయటం. అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు :
ఎవరైతే విశ్వసించారో వారి హృదయాలు అల్లాహ్ ధ్యానం వలన తృప్తి పొందుతాయి. జాగ్రత్తగా వినండి! కేవలం అల్లాహ్ ధ్యానమే (స్మరణయే) హృదయాలకు తృప్తినిస్తుంది. [అర్రఅద్: 28]
మరియు ఎప్పుడెప్పుడైతే ముస్లిము అల్లాహ్ కొరకు తన స్మరణను, తన ఖుర్ఆన్ పఠనమును అధికం చేస్తాడో అల్లాహ్ తఆలాతో అతని అనుబంధము అధికమగును. మరియు మనస్సు పరిశుభ్రమగును. మరియు అతని విశ్వాసము దృఢమగును.
ఇలాగే ఒక ముస్లిం తన ధర్మ ఆదేశాలను సరైన వనరుల నుండి తెలుసుకోవటానికి ఆసక్తి చూపటం అవసరం. చివరికి అతను అంతర్దృష్టితో అల్లాహ్ తఆలా ఆరాధన చేస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు : విధ్యను అభ్యసించటం ప్రతీ ముస్లిం పై తప్పనిసరి. మరియు తనను సృష్టించిన అల్లాహ్ తఆలా ఆదేశములకు లోబడి అంగీకరించేవాడై ఉండటం ఒక వేళ వాటి విజ్ఞత గుర్తించిన లేదా గుర్తించకపోయిన సమానము.
అల్లాహ్ తఆలా తన దివ్యగ్రంధములో ఇలా సెలవిచ్చాడు :
మరియు అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు, ఒక విషయంలో నిర్ణయం తీసుకున్నప్పుడు, విశ్వసించిన పురుషునికి గానీ లేక విశ్వసించిన స్త్రీకి గానీ ఆ విషయంలో మరొక నిర్ణయం తీసుకునే హక్కు లేదు. మరియు ఎవడైతే అల్లాహ్ మరియు ఆయన సందేశహరునికి అవిధేయుడవుతాడో వాస్తవంగా అతడు స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నట్లే! [అల్ అహ్జాబ్ : 36]
అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులందరిపై శుభాలను, శాంతిని కలిగించుగాక.