షేఖ్ ఆదమ్ రియాదీ భారతదేశంలో విద్యనభ్యసించారు, ఆయన కరీంనగర్, తెలంగాణా ప్రాంతంలో జన్మించారు. ప్రస్తుతం ఆయన తన ఉద్యోగం చేసుకుంటూ, రబ్వహ్ ఇస్లామీయ ప్రచారం కేంద్రంలో, తెలుగు విభాగంలో ఉపాధ్యాయులుగా కూడా సేవలు అందిస్తున్నారు.
షేఖ్ ముహమ్మద్ రబ్బానీ గారు మనందరికీ పరిచయం ఉన్న ఒక సుప్రసిద్ధ దాయి. ఆయన ఇస్లాం ధర్మాన్ని పరిచయం చేస్తూ అనేక ఉపన్యాసాలు ఇచ్చారు. అనేక మంది ముస్లిమేతరులతో ఆయన ఇస్లాం ధర్మం గురించి చర్చించారు. ఆయన సేవలను అల్లాహ్ స్వీకరించుగాక.
షేర్ జాద్ అబ్దుర్రహ్మాన్ బిన్ తాహ్ బిన్ హసన్ అల కూఫీ అల్ కుర్దీ అష్షాఫియీ. ఉత్తర ఇరాఖ్ లోని మోసల్ పట్టణంలో 1968వో జన్మించారు. ఇరాఖ్ మరియు ఇతర ప్రాంతాలలోని షేఖుల వద్ద విద్యాభ్యాసం చేసినారు. వారిలో కొందరు షేఖ్ అబ్దుల్లతీఫ్ ఖలీల్ అల్ సూఫీ, షేఖ్ అల్ హాఫిజ్ అలీ బిన్ హసన్ అల వసాబీ, షేఖ్ హాఫిజ్ ఖారీ అబ్దుర్రజ్జాఖ్ ముహమ్మద్ ఇమారతీ. ఇరాఖ్, యమన్ మరియు దుబయ్ లోని అనేక మస్జిదులలో ఇమాంగా పనిచేసారు.