మగ్రిబ్ కు చెందిన ప్రసిద్ధ ఖుర్ఆన్ పఠనాకర్త అద్దరీర్ ముస్తపా గరబీ. ఖిరాత్ లో ఉద్ధండుడు అంటే షేఖుల్ ఖుర్రా గా ప్రసిద్ధ చెందినారు. ఆయన అష్షరాకీ ఖబీలా నాయకుల వంశంలో పుట్టారు.
భారతదేశంలోని జామియ దేవబంద్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీథులు బోధించే ఉపాధ్యాయుడు, భారతదేశ ఇస్లామీయ పండితుల నాయకుడు, అనేక భారతదేశ ఇస్లామీయ సంస్థలకు నాయకుడు.
ఆయన పేరు మూసా బిలాల్. మక్కాలోని జామియ అన్నూర్ లో ఆయన ఇమాం, ఖతీబ్, ఖుర్ఆన్ యొక్క ఖిరఆత్ అల్ అష్రహ్ యొక్క ఉపాధ్యాయుడు. 1420 మరియు 1433 సంవత్సరాలలో దుబాయ్ లో ప్రతిసంవత్సరం జరిగే ఖుర్ఆన్ పఠనాకర్తల పోటీ విజేతలను ఎంపిక చేసే బృందంలో సభ్యుడుగా ఉండినారు.
ఆయన పూర్తి పేరు షేఖ్ ఖారీ యహ్యా అహ్మద్ ముహమ్మద్ అల్ హలీలీ. 1372హి అంటే 1952లో యమన్ లోని సనఆ ప్రాంతంలోని నాహియహ్ దగ్గర ఉన్న హలీలీ పల్లెలో జన్మించారు. సనఆలోని జామియ అల్ కబీర్ లో ఖుర్ఆన్ పఠనం మరియు కంఠస్థం హలఖాలలో చేరినారు. 1382 అంటే 1962లో ఖుర్ఆన్ కంఠస్థం పూర్తి చేసారు. తర్వాత సనఆలోని సుప్రసిద్ధ పండితుల వద్ద సబఅ ఖిరాత్ అభ్యసించారు. 1393 అంటే 1973లో అరబీ భాషలో పట్టభద్రులయ్యారు. తర్వాత 1390 అంటే 1970 నుండి సనఆ లోని హయ్యల్ తహ్రీర్ లో ఉన్న జామియ మస్జిద్ లో ఖుర్ఆన్ టీచర్, ఇమాం మరియు ఖతీబ్ గా పనిచేయడం ప్రారంభించారు. 1421 అంటే 2000లో ఖుర్ఆన్ కరీమ్ కంఠస్థం ధృవీకరించే సంస్థకు మరియు ఖుర్ఆన్ కంఠస్థ పోటీలు నిర్వహించే సంస్థకు నాయకత్వం వహించారు. ఈజిప్టులో జరిగిన కొన్ని ఖుర్ఆన్ కంఠస్థ సమావేశాలలో పాల్గొన్నారు.