• తెలుగు

    రచయిత, అంశాల సంఖ్య : 1

    ఆయన పూర్తి పేరు జజాఇ బిన్ ఫలీహ్ హమూద్ అస్సువైలీ. కువైత్ లో 1969లో జన్మించారు. కువైత్ లో ప్రసిద్ధ చెందిన ఖుర్ఆన్ పఠనాకర్తలలో ఆయన ఒకరు. కువైత్ లోని జావియ ఇస్లామీయ షరిఅహ్ మరియు స్టడీస్ కాలేజ్ నుండి పట్టభద్రులయ్యారు. జాతల్ జామియలో ఉన్న మద్రసలో ఖుర్ఆన్ మరియు తజ్వీద్ అభ్యసించారు.

  • తెలుగు

    రచయిత, అంశాల సంఖ్య : 1

    ఆయన పూర్తి పేరు షేఖ్ ఖారీ యహ్యా అహ్మద్ ముహమ్మద్ అల్ హలీలీ. 1372హి అంటే 1952లో యమన్ లోని సనఆ ప్రాంతంలోని నాహియహ్ దగ్గర ఉన్న హలీలీ పల్లెలో జన్మించారు. సనఆలోని జామియ అల్ కబీర్ లో ఖుర్ఆన్ పఠనం మరియు కంఠస్థం హలఖాలలో చేరినారు. 1382 అంటే 1962లో ఖుర్ఆన్ కంఠస్థం పూర్తి చేసారు. తర్వాత సనఆలోని సుప్రసిద్ధ పండితుల వద్ద సబఅ ఖిరాత్ అభ్యసించారు. 1393 అంటే 1973లో అరబీ భాషలో పట్టభద్రులయ్యారు. తర్వాత 1390 అంటే 1970 నుండి సనఆ లోని హయ్యల్ తహ్రీర్ లో ఉన్న జామియ మస్జిద్ లో ఖుర్ఆన్ టీచర్, ఇమాం మరియు ఖతీబ్ గా పనిచేయడం ప్రారంభించారు. 1421 అంటే 2000లో ఖుర్ఆన్ కరీమ్ కంఠస్థం ధృవీకరించే సంస్థకు మరియు ఖుర్ఆన్ కంఠస్థ పోటీలు నిర్వహించే సంస్థకు నాయకత్వం వహించారు. ఈజిప్టులో జరిగిన కొన్ని ఖుర్ఆన్ కంఠస్థ సమావేశాలలో పాల్గొన్నారు.

  • తెలుగు

    రచయిత, అంశాల సంఖ్య : 1

    కువైత్ దేశానికి చెందిన ఖారీ

  • తెలుగు

    రచయిత, అంశాల సంఖ్య : 1

    ఆయన పూర్తి పేరు షేఖ్ బాసిల్ బిన్ అబ్దుర్రహ్మాన్ అర్రావీ. బాగ్దాద్ ప్రాంతంలో ఆయన 1953వ సంవత్సరంలో జన్మించారు. 1975వ సంవత్సరం రాజకీయ మరియు న్యాయశాస్త్రంలో మొట్టమొదటి శ్రేణిలో పట్టభద్రులయ్యారు. 1977లో ఫారిన్ అఫైర్స్ లో డిప్లొమా చేసి, 1990లో అక్కడ పని చేయడం ఆపివేసారు. తర్వాత ఖుర్ఆన్ పఠనం మరియు కంఠస్థం మొదలు పెట్టారు. హఫ్స్ అన్ ఆశిమ్ రివాయతులో అష్షాతబీ పద్ధతిలో 1997లో షేఖ్ డాక్టర్ సయ్యద్ ముహమ్మద్ సాదాతీ అష్షన్ఖీతీ, ప్రొఫెసర్ ఇమామ్ ముహమ్మద్ బిన్ సఊద్ అల్ ఇస్లామీయ, రియాద్ నుండి ఖుర్ఆన్ పఠనం మరియు కంఠస్థంలో ఇజాజత్ పొంది, అప్పటి నుండి రియాద్ పట్టణంలో నివసించసాగారు.

  • తెలుగు

    రచయిత, అంశాల సంఖ్య : 1

    సౌదీ అరేబియాకు చెందిన ఖారీ

  • తెలుగు

    రచయిత, అంశాల సంఖ్య : 1

    ఆయన 1986వ సంవత్సరం ఏప్రిల్ 19వ తేదీన ఇరాఖ్ దేశ రాజధాని నగరమైన బాగ్దాద్ లో జన్మించారు. ఆయన ఇరాఖ్ దేశ ఖుర్ఆన్ ఫఠనాకర్తల సంస్థలో సభ్యుడిగా పనిచేసారు. అనేక ఖుర్ఆన్ పఠనం పోటీలలో పాల్గొన్నారు. బాగ్దాద్ లో ఆయన 2007వ సంవత్సరం మే నెల 26వ తేదీన అమెరికన్ సైనిక దళాలతో ముఖాముఖీ పోరాడుతూ మరణించారు.

  • తెలుగు

    రచయిత, అంశాల సంఖ్య : 1

    ఆయన పూర్తి పేరు అహ్మద్ బిన్ ముహమ్మద్ అబ్దుల్లాహ్ బిన్ మయీద్ అల్ హవాషీ. సౌదీ అరేబియా దక్షిణ ప్రాంతంలోని ఖమీస్ మిషాయిత్ పట్టణంలోని జామియ అల్ కబీర్ మస్జిద్ యొక్క ఇమాం మరియు ఖతీబ్. 1374లో అహద్ రహీదహ్ పట్టణంలో జన్మించారు.

  • తెలుగు

    రచయిత, అంశాల సంఖ్య : 1

    1982 జులైలో, సూడాన్ లోని ఉత్తర కుర్దఫాన్ కు చెందిన అమరూబిహ్ ప్రాంతంలోని అల్ బనియ్యహ్ లో జన్మించారు. 2009వ సంవత్సరం, సెప్టెంబరులో షేఖ్ ఖిరా అల్ అజ్ హర్ నుండి ఖిరాత్ అనుమతి పత్రం పొందారు.

  • తెలుగు

    రచయిత, అంశాల సంఖ్య : 1

    ఆయన పూర్తి పేరు మహ్మూద్ అహ్మద్ అబ్దుల్ హకీమ్. 1915వ సంవత్సరం ఫిబ్రవరీ 1వ తేదీ, సోమవారం నాడు సయీద్ ఈజిప్టులోని ఖనా అల్ అరీఖహ్ ప్రాంతం, అబూ తషత్ కేంద్రం, అల్ కరంక్ అష్షహీరతుల్ తాబఅహ్ లో జన్మించారు. పదవ ఏట ఖుర్ఆన్ గ్రంథాన్ని పూర్తిగా కంఠస్థం చేసారు. తర్వాత ఆయన తండ్రి ఆయనను తంతా పట్టణంలోని మఆహద్ అల్ అహ్మదీలో రెండేళ్ళ చదువు కోసం చేర్పించారు. అక్కడ ఆయన తజ్వీద్, ఖిరాత్ నేర్చుకున్నారు. తర్వాత జామియ అజ్ హర్ లో ప్రవేశించారు. అక్కడ ఆయన రెండేళ్ళ వరకు విద్యాభ్యాసం చేసినారు. ఆ సమయంలో ఆనాటి సుప్రసిద్ధ ఖుర్రాలను అనుకరించి ఖుర్ఆన్ పఠనం చేయడం ప్రారంభించగా, ప్రజలు ఆయన ఖిరాత్ ను ఎంతో మెచ్చుకునేవారు. ఇంకా ఆయనను ఖిరాత్ విద్యలో ఎంతో ఎత్తుకు ఎదిగిపోవాలని ప్రోత్సహించేవారు. ఆ విధంగా ఆయన పేరు ఖిరాత్ లో దినదినానికి వ్యాపించసాగింది. 1940వ సంవత్సరంలో ఆయన తిలావత్ లో ఉద్ధండులైన ముహమ్మద్ రఫఅత్, అలీ మహ్మూద్, అస్సైఫీ మొదలైన ఖుర్రాలతో ఖుర్ఆన్ పఠనంలో పాల్గొని, వారి ప్రశంసలు అందుకున్నారు. 1982వ సంవత్సరం సెప్టెంబరు 13వ తేదీ, సోమవారం రోజున మరణించారు.

  • తెలుగు

    రచయిత, అంశాల సంఖ్య : 1

    ఈజిప్టు దేశానికి చెందిన ఖారీ

  • తెలుగు

    రచయిత, అంశాల సంఖ్య : 1

    ఆయన పూర్తి పేరు ముహమ్మద్ రషాద్ బిన్ అబ్దుస్సలామ్ అబ్దుర్రహ్మాన్ అష్షరీఫ్. 1925వ సంవత్సరం ఫలస్తీనా దేశంలోని అల్ ఖలీల్ పట్టణంలో జన్మించారు. ఇస్లామీయ ప్రపంచంలో ఆయన ఒక సుప్రసిద్ధ ఖారీ. అల్ ఖలీల్ లోని మస్జిద్ అల్ ఇబ్రాహీమీ మరియు మస్జిద్ అల్ అఖ్సాలో ఇమామ్ గా పనిచేసారు. 2002వ సంవత్సరం నుండి జోర్డాన్ లోని ఐష్ పట్టణంలో నివశిస్తున్నారు. అల్ అబ్దాలీ లోని మస్జిద్ అల్ మలిక్ అబ్దుల్లాహ్ అవ్వల్ లో ఇమామ్ గా పనిచేస్తున్నారు.

  • తెలుగు

    రచయిత, అంశాల సంఖ్య : 1

    1966వ సంత్సరంలో లెబనాన్ లో జన్మించారు. అరబీ భాషా సాహిత్యంలో ఆయన డాక్టరేట్ చేసినారు. తర్వాత ఇస్లామీయ షరిఅహ్ (ఖిరాత్ స్పెషలైజేషన్)లో హయ్యర్ డిప్లోమా చేసినారు. తజ్వీద్, ఖిరాత్, ఇస్లామీయ షరిఅహ్ మరియు అరబీ భాషలలో ప్రావీణ్యం సంపాదించారు. ఎఫ్. ఎమ్ రేడియోలోని తిలావత్ ప్రోగ్రాములలో ఆయన జనరల్ సూపర్ వైజర్ గా పనిచేసారు. జోర్డాన్ ప్రభుత్వంలోని అల్ అవ్ ఖాఫ్ కు చెందిన దార్ అల్ ఖుర్ఆన్ ప్రచురణ సంస్థలో కూడా ఆయన సూపర్ వైజర్ గా పనిచేసారు. 1990 నుండి ఆయన తజ్వీద్ నేర్పుతున్నారు. జోర్డాన్ లోని కొన్ని ఇస్లామీయ షరిఅహ్ కాలేజీలలో విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేసారు. మలేసియాలోని జామియ అల్ ఇస్లామీయ ఇంటర్నేషనల్ లో ఉపన్యాసాలు ఇచ్చారు. أثر الدلالة اللغوية في اختلاف المسلمين في أصول الدين. • معجم علوم القرآن. • تقويم اللسان بتلاوة القرآن. • التسامح المذهبي بين المسلمين فريضة وضرورة. • سيد القراء الإمام الشاطبي. • شواهد القراءات. • من أعلام القراء والمقرئين మొదలైన పుస్తకాలు రచించారు.

  • తెలుగు

    రచయిత, అంశాల సంఖ్య : 1

    ఈజిప్టు దేశానికి చెందిన ఖారీ

  • తెలుగు

    అంశాల సంఖ్య : 0

  • తెలుగు

    అంశాల సంఖ్య : 0

  • తెలుగు
  • తెలుగు

    అంశాల సంఖ్య : 0

  • తెలుగు
  • తెలుగు

    అంశాల సంఖ్య : 0

  • తెలుగు

    రచయిత, అంశాల సంఖ్య : 1

    షేఖ్ ఆదమ్ రియాదీ భారతదేశంలో విద్యనభ్యసించారు, ఆయన కరీంనగర్, తెలంగాణా ప్రాంతంలో జన్మించారు. ప్రస్తుతం ఆయన తన ఉద్యోగం చేసుకుంటూ, రబ్వహ్ ఇస్లామీయ ప్రచారం కేంద్రంలో, తెలుగు విభాగంలో ఉపాధ్యాయులుగా కూడా సేవలు అందిస్తున్నారు.