ఇది Islamicpamphlets పబ్లిషర్స్ ప్రచురించిన కరపత్రాల సంకలనం. దీనిలో అనేక మంచి మంచి వ్యాసాలు ఉన్నాయి. ఇస్లాం గురించి తెలుసుకోవాలనుకునే వారి కొరకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇస్లాం గురించి ప్రజలలో వ్యాపించి ఉన్న అపోహలను, భ్రమలను దూరం చేస్తుంది. అంతేగాక, 1436హిజ్రీ (2015) సంవత్సరపు రమదాన్ సాంస్కృతిక పోటీ పుస్తకం కూడా. దీని చివరిలో పోటీ షరతులు మరియు క్విజ్ ప్రశ్నలు ఉన్నాయి. వాటి జవాబులు సమయంలోపల రబ్వహ్ జాలియాత్ కు పంపగలిగితే, మీరు మంచి బహుమతి పొందే అవకాశం కూడా ఉన్నది.
ఇస్లాం ధర్మం గురించి పరిచయం చేస్తున్న ఒక సంక్షిప్త కరపత్రం ఇది. ఇస్లాం ధర్మ ఐదు మూలసిద్ధాంతాలు, ఇస్లాం ధర్మంలోని ఆరాధనలు మరియు వాటి అసలు ఉద్దేశం, ఇస్లాం ధర్మ విశ్వాసం యొక్క ఆరు మూలసిద్ధాంతాలు మొదలైన వాటిపై దృష్టి సారిస్తున్నది. చాలా సులభరీతిలో, చక్కటి పదాలలో పై విషయాలన్నీ దీనిలో ప్రస్తావించబడినాయి.
ఈ వ్యాసంలో ఎందుకు ఇస్లాం స్వీకరించాలి అనే ముఖ్యాంశం గురించి ప్రామాణిక సాక్ష్యాధారలతో చక్కగా వివరించారు. దీని ద్వారా నిష్పక్షపాతంగా చదివే పాఠకులకు చాలా సులభంగా అసలు ఇస్లాం అంటే ఏమిటి అనే సత్యం తెలిసి పోతుంది. ఇది ఇస్లామిక్ పాంప్లెట్స్ అనే సంస్థ ఇంగ్లీషులో తయారు చేసిన ఒక కరపత్రం యొక్క తెలుగు అనువాదం.
ఈ వ్యాసంలో మన జీవిత అసలు ఉద్దేశ్యం ఏమిటి అనే అంశం గురించి ఇస్లామీయ బోధనలు మరియు లాజికల్ విషయాల ఆధారంగా చర్చించబడింది. దీని ద్వారా నిష్పక్షపాతంగా చదివే పాఠకులు చాలా సులభంగా తమ జీవన ఉద్దేశ్యం గురించి గ్రహించి, ఇస్లాం ధర్మం స్వీకరించే అవకాశం ఉన్నది. ఇది ఇస్లామిక్ పాంప్లెట్స్ అనే సంస్థ ఇంగ్లీషులో తయారు చేసిన ఒక కరపత్రం యొక్క తెలుగు అనువాదం.
ఈ వీడియోలో మానవులందరికీ అల్లాహ్ సందేశం అనే ముఖ్య విషయం పై గుంటూర్ పట్టణంలోని సెంటర్ ఫర్ ఫైనస్ మెసేజ్ టు మాన్ కైండ్ అనే ధర్మప్రచార సంస్థకు చెందిన ప్రముఖ ఉపన్యాసకులు జనాబ్ అబ్దుల్ కరీమ్ గారు ఖుర్ఆన్ మరియు సున్నతుల ప్రామాణిక ఆధారాలతో చాలా చక్కగా వివరించారు.
ఈ వీడియోలో మానవ జీవిత లక్ష్యం ఏమిటి అనే ముఖ్య విషయం పై గుంటూర్ పట్టణంలోని సెంటర్ ఫర్ ఫైనస్ మెసేజ్ టు మాన్ కైండ్ అనే ధర్మప్రచార సంస్థకు చెందిన ప్రముఖ ఉపన్యాసకులు జనాబ్ అబ్దుర్రహ్మాన్ గారు ఖుర్ఆన్ మరియు సున్నతుల ప్రామాణిక ఆధారాలతో చాలా చక్కగా వివరించారు.
ఈ పుస్తకంలో ఇస్లాం ధర్మంలోని సత్యం తనను ఎలా ప్రభావితం చేసిందో రచయిత వివరించారు. ప్రజలు సామాన్యంగా నమ్మే ‘ధర్మాలన్నీ ఒకటే, ఏ దేవుణ్ణి కొలిచినా పర్వాలేదు’ అనే అపోహలకు చాలా మంచిగా సమాధానం ఇచ్చి, సత్యం ఏమిటో ప్రజల ముందు తేటతెల్లం చేసారు